YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

గూగుల్ పేకు నోటీసులు

 గూగుల్ పేకు నోటీసులు
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
మీరు గూగుల్ పే యాప్ వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం క్యాష్‌బ్యాక్. మీరు గూగుల్ పే యాప్ ద్వారా ఇతరులకు డబ్బులు పంపితే గూగుల్ మీకు క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బులు ఇస్తుంది. ప్రతిసారి డబ్బులు రావు. ఏదో అప్పుడప్పుడు వస్తాయి. అది కూడా భారీగా ఏం కాదు కొంచెం మొత్తంలోనే. ఈ క్యాష్‌బ్యాక్ కోసం చాలా మంది యాప్‌ను వాడటం ప్రారంభించారు. అయితే ఇప్పుడు గూగుల్ పే యాప్ వాడేవారికి షాకిచ్చే న్యూస్ వెల్లడైంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అధికారిక ధ్రువీకరణ లేకుండానే గూగుల్‌ పే యాప్‌ దేశంలో ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే అంశమే. ఢిల్లీ హైకోర్టు బుధవారం గూగుల్‌ పే పై దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని (పిల్) విచారించింది. ఈ సందర్భంగా ఆర్‌బీఐ అనుమతి లేకుండా గూగుల్ పే ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తోందనే అంశం వెల్లడైంది. దీంతో కోర్టు.. ఆర్‌బీఐ, గూగుల్‌ సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేకుండానే గూగుల్‌ పే యాప్

Related Posts