YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పోలింగ్ కేంద్రం వద్ద మందుపాతర పేల్చిన మావోయిస్టులు

పోలింగ్ కేంద్రం వద్ద మందుపాతర పేల్చిన మావోయిస్టులు

మహారాష్ట్రలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చి కలకలం రేపారు. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మందుపాతర పేలిన సమయంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటింగ్ జరుగుతోంది. కాగా ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గడ్చిరోలి జిల్లాలో గత రెండు రోజుల్లో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఓ సీఆర్‌పీఎఫ్ జవాను గాయపడ్డారు. మరోవైపు చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఇవాళ ఉదయం నక్సలైట్లు మందుపాతర పేల్చారు. బస్తర్ నియోజకవర్గంలో భద్రతా దళాలు ఎన్నికల సిబ్బందిని పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదనీ.. అందరూ సురక్షితంగా తప్పించుకున్నారని ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. మంగళవారం మావోయిస్టులు దంతేవాడలో మందుపాతర పేల్చడంతో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, ఆయన ముగ్గురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Related Posts