
యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఐపీఎల్-12లో బెంగళూరు పరాజయ పరంపరకు తెరపడింది. ఆ జట్టు టోర్నీలో తొలి గెలుపు రుచి చూసింది. వరుసగా ఆరు మ్యాచ్లు ఓడిన ఆర్సీబీ.. ఏడో మ్యాచ్లో విజయాన్నందుకుంది. శనివారం ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను ఓడించింది. కోహ్లి, డివిలియర్స్ సత్తా చాటడంతో 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. మొదట పంజాబ్ 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.