YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల మృతి
ఝార్ఖండ్ లో ని గిరిదీహ్ అడవుల్లో ఎదురుకాల్పులు జరిగాయి.  మావోయిస్టులు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో  ముగ్గురు నక్సల్స్  మృతి చెందారు. ఈ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గిరిదీహ్ జిల్లా బెల్బాఘాట్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ ఏడో బెటాలియన్  చెందిన జవాన్లు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరిపి ముగ్గురు నక్సల్స్  హతమార్చారు. ఘటనాస్థలంలో ఒక ఏకే-47 రైఫిల్, 3 బులెట్ మ్యాగజైన్లు, 4 పైపు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో ఘటనాస్థలంలో ముమ్మర గాలింపు చేపట్టారు. 

Related Posts