YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నూతన ప్రయాణం ప్రారంభించా : ప్రకాశ్ రాజ్

 నూతన ప్రయాణం ప్రారంభించా : ప్రకాశ్ రాజ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

రెండో దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 95 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 18న) పోలింగ్ ముగిసింది తమిళనాడులోని 38 స్థానాలతోపాటు కర్ణాటకలోని 14 స్థానాలకు కూడా ఎన్నికలను నిర్వహిస్తున్నారు. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సినీ, క్రికెట్, రాజకీయ ప్రముఖులు లైన్లలో నిలబడి ఓటేస్తున్నారు. మీరు కూడా ఓటేయండి ఓటర్లకు పిలుపునిస్తున్నారు. సినీ నటుడు ప్రకాశ్ రాజు కూడా బెంగళూరులో ఓటేశారు. 41 ఏళ్ల క్రితం తను చదువుకున్న స్కూళ్లోని క్లాస్ రూంలోనే ఓటేశానని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయన్న ఆయన.. నూతన ప్రయాణం మొదలైందని ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు పలికారు. ‘నిజాలను నలుగురిలో నిర్భయంగా మాట్లాడగలిగే వారిలో ప్రకాశ్ రాజ్ ఒకరు. అలాంటి గొంతు పార్లమెంట్‌లో తప్పకుండా వినిపించాలని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రకాశ్ రాజ్ నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.ప్రకాశ్ రాజ్ గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్‌ తదితరులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా, తనకు కాంగ్రెస్ పార్టీ మద్దతునిస్తోందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు

Related Posts