YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

శ్రీలంక బాంబు పేలుళ్లు లో 290కి చేరిన మృతులు

  శ్రీలంక బాంబు పేలుళ్లు లో 290కి చేరిన మృతులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం ఉదయానికి ఈ సంఖ్య 290కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. మరో 500 మందికిపైగా ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ దాడులతో సంబంధం ఉన్న మొత్తం 24 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఆదివారం దేశవ్యాప్తంగా విధించిన నిరవధిక కర్ఫ్వూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంక ఎయిర్‌పోర్టు ప్రాంతంలో అమర్చిన ఓ పైపు బాంబును తాజాగా భద్రతా సిబ్బంది కనుగొని నిర్వీర్యం చేశారు.

Related Posts