YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భయపెడుతున్న ఫణి

భయపెడుతున్న ఫణి
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ప్రస్తుతం హిందూ మహాసముద్రం, మధ్య బంగాళాఖాతంలో పరిసరాల్లో కొనసాగుతోందని, శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది శ్రీలంక తూర్పుతీరం దిశగా ప్రయాణించి ఈ నెల 30కి తమిళనాడు తీరాన్ని తాకనుందని వెల్లడించారు. దీనికి ‘ఫణి’గా నామకరణం చేశారు. దీని పయనంగా శనివారానికి ఓ స్పష్టత వస్తుందన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం 30-31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం వల్ల తుపాను బలపడేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది 30వ తేదీకి తమిళనాడు తీరాన్ని దాటుతుందని అంచనా వేస్తున్నప్పటికీ దిశ మార్చుకునే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. తుపాను తీరాన్ని సమీపించే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారుతు వెల్లడించారు. ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో ‘ఫణి’ తుపాను తమిళనాడు తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. 26 నుంచి వర్షాలు ప్రారంభమైన 28 నుంచి మే 1 వరకు అతిభారీ వర్షాలు కురుస్తామని చెబుతోంది. దీంతో తమిళనాడు సహా కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో రెడ్ అలర్డ్ ప్రకటించింది. తుపాను ప్రభావంతో 90కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, కాబట్టి మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ శాఖ డైరెక్టర్‌ బాలచంద్రన్‌ సూచించారు. తుఫాను ప్రభావం కేరళపై కూడా ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. హిందూ మహాసముద్రానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారింది. శ్రీలకంలోని ట్రింకోమలీకి 1140 కి.మీ తూర్పు ఆగ్నేయంగా, చెన్నైకి 1490 కి.మీ ఆగ్నేయంగా, మచిలీపట్నానికి 1760 కి.మీ దక్షిణ ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అనంతరం శనివారం రాత్రికి తుఫానుగా మారనుందని ఐఎండీ పేర్కొంది. 96 గంటల్లో శ్రీలంక తీరానికి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30వ తేదీన ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్రల మద్య తుపాన్‌ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. మే 1వ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాన్‌ కారణంగా తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయి. తుపాను తీరం దాటే నాటికి తీవ్రత మరింత పెరిగి, పెను గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో పాటు.. అలలు సాధారణం కంటే ఒక మీటర్‌ ఎగసిపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రేపటిలోగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. 

Related Posts