YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం ఖండించిన త్రిపుర ముఖ్యమంత్రి విప్ల‌వ్‌ దేవ్ భార్య నితి దేవ్

విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలు అబద్ధం           ఖండించిన త్రిపుర ముఖ్యమంత్రి విప్ల‌వ్‌ దేవ్ భార్య నితి దేవ్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తాను విడాకులు తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై త్రిపుర ముఖ్యమంత్రి విప్ల‌వ్‌ దేవ్ భార్య నితి దేవ్ స్పందించారు. ఒకవేళ నేను లీగల్ పిటిషన్ దాఖలు చేసి ఉంటే.. వేరే వాళ్లతో ఈ వార్తను ఎందుకు విస్తృతంగా వైరల్ చేస్తాను. నేనే అందరికీ దీని గురించి చెప్పేదాణ్నిఅని పేర్కొన్నారు.రాష్ర్టాభివృద్ధి కోసం బిప్లవ్ దేవ్ కష్టపడుతున్నారని ఐతేకొంతమంది మాత్రం పనిగట్టుకొని తన భర్తను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. విప్ల‌వ్‌ తన భార్యను వేధింపులకు గురిచేస్తూ గృహహింసకు పాల్పడ్డారని.. ఈ క్రమంలో నితి దేవ్ ఆయనకు విడాకులు ఇవ్వనున్నారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం అయిన నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు.డైవర్స్ పుకార్లపై నితి మాట్లాడుతూ.. విడాకుల సమాచారం తెలియగానే ఆశ్చర్యానికి గురయ్యా. గత 15 రోజుల నుంచి నేను మా ఇంటికి దూరంగా ఉంటున్నాను. దీంతో ఈ పుకార్లు సృష్టించి సర్క్యూలేట్ చేశారు. నా పిల్లల గురించే నేను చాలా బాధపడ్డాను. వాళ్లకు ఈ విషయం తెలిస్తే వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారు బిప్లవ్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడన్న వార్తలపై స్పందిస్తూ.. ఒక మహిళ గురించి ఏదైనా చెప్పడం చాలా సులువు. ఇంతకుముందు మా రాష్ట్ర మంత్రి శంతనా చక్మాను లక్ష్యంగా చేసుకున్నారు..ఈసారి ఏకంగా నన్నే టార్గెట్ చేసి నా భర్తను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నితి ఆరోపించారు.

Related Posts