YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్..!!

స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్..!!

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

పంజాబ్, చండీగఢ్ రాష్ట్రాల్లో ప్రచారాన్ని నిర్వహించే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. వీరిలో పార్టీ అధినేత రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీలు ఉన్నారు. వీరితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, కీలక నేతలైన అహ్మద్ పటేల్, అంబికా సోని, కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, షీలా దీక్షిత్, మనీశ్ తివారీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, రాజ్ బబ్బర్, జైవీర్ షెర్గిల్ తదితరులు ఉన్నారు. మే 19న (చివరి దశ) ఈ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది.

Related Posts