Highlights
- ఆదేశించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు
- ఇప్పటివరకు 10.2 టీఎంసీలను కుడికాల్వ ద్వారా విడుదల
- మిగతా నీటిని వదలడం లేదని ఏపీ ఆరోపణలు
- ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరింపు
ఆంధ్రప్రదేశ్ నిర్ణయించిన నీటికంటే ఎక్కువ వాడుకొందని తెలియడంతో ఇటీవల నీటి విడుదలను నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశించింది.ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా బోర్డు 10.5 టీఎంసీల నీటిని కేటాయించడంతో ఇప్పటివరకు 10.2టీఎంసీలను కుడికాల్వ ద్వారా అధికారులు విడుదల చేశారు.అయితే, మరో 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉండగా తెలంగాణ అధికారులు అడ్డుకున్నారని ఆంధ్రప్రదేశ్ అధికారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు చెలరేగకుండా అక్కడ ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ అధికారులు చర్చలు జరుపుతున్నారు.