YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బ్యాంకు వడ్డీ రేట్లు పెంపుదల

Highlights

  • పలు రకాల కాల వ్యవధులపై అరశాతం 
  • నేటి నుంచే అమల్లోకి
  • కొత్త డిపాజిట్లకు, రెన్యువల్ డిపాజిట్లకు అమలు
  • సీనియర్ సిటిజన్లకు అరశాతం అదనం
బ్యాంకు వడ్డీ రేట్లు పెంపుదల

బ్యాంక్ డిపాజిట్లపై  పలు కాల వ్యవధులపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను ఎస్ బీఐ పెంచింది. తాజా రేట్లు కొత్తగా డిపాజిట్ చేసే వారికి, కాల వ్యవధి తీరి రెన్యువల్ అయ్యే డిపాజిట్లకు వర్తిస్తాయని పేర్కొంది. కర్ణాటక బ్యాంకు, పీఎన్ బీ డిపాజిట్ రేట్లను ఇప్పటికే పెంచైనా విషయం తెలిసిందే. తాజాగా  ఎస్ బీఐ తీసుకున్న నిర్ణయంతో  7-45 రోజుల కాల వ్యవధి మధ్య ఉన్న డిపాజిట్లపై ప్రస్తుతం 5.25 శాతం వడ్డీ రేటు ఉండగా దీన్ని 5.75 శాతం చేసింది. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ తెలిపింది.  ఏడాది కాల వ్యవధి కలిగిన డిపాజిట్ పై ఇప్పటి వరకు 6.25 శాతం వడ్డీ రేటు ఉండగా డిపాజిట్ దారులు ఇకపై 6.40 శాతం పొందొచ్చు. రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు కాల వ్యవధితో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇది 6 శాతమే. ఇక ఇదే కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు దాటిన వృద్ధులు) అర శాతం అదనంగా 7 శాతం మేర వడ్డీ రేటుకు అర్హులు. ఈ కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి వస్తాయని ఎస్ బీఐ తెలిపింది. కర్ణాటక బ్యాంకు, పీఎన్ బీ డిపాజిట్ రేట్లను ఇప్పటికే పెంచగా, ఎస్ బీఐ తాజా నిర్ణయంతో ఇతర బ్యాంకులు కూడా ఇదే బాటలో నడుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts