YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ తగ్గిన బంగారం

 మళ్లీ  తగ్గిన బంగారం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పసిడి ధర మళ్లీ తగ్గింది. దేశీ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.32,620కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం సహా అంతర్జాతీయ ట్రెండ్ బలహీనంగా ఉండటం ఇందుకు కారణం. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా మూడో రోజు. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.825 క్షీణతతో రూ.37,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది.  గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధర ఔన్స్‌కు 0.90 శాతం తగ్గుదలతో 1,272.65 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.24 శాతం క్షీణతతో 14.69 డాలర్లకు తగ్గింది. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు నిలుపుదల నిర్ణయం కూడా బంగారంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.32,620కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ.32,450కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది.కేజీ వెండి రూ.825 తగ్గుదలతో రూ.37,700కు క్షీణిస్తే.. .. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.699 క్షీణతతో రూ.36,374కు దొగిచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.78,000కు, అమ్మకం ధర రూ.79,000కు పడిపోయింది.

Related Posts