YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ సర్జికల్ దాడులు... ఎవ్వరికి తెలియరాలేదు

కాంగ్రెస్ సర్జికల్ దాడులు... ఎవ్వరికి తెలియరాలేదు

యువ్ న్యూస్ పోలిటికల్ బ్యూరో:

పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా 6 సార్లు సర్జికల్ దాడులు చేశామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు సర్జికల్ దాడులు చేస్తే అది ఉగ్రవాదులకు కూడా తెలియలేదని ఎద్దేవా చేశారు. ఈ సర్జికల్ దాడుల గురించి పాకిస్థాన్ కు తెలియలేదనీ, కనీసం సొంత భారతీయులకు కూడా తెలియకుండానే దాడులు జరిగాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజస్థాన్ లోని సికర్ లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు.‘కాంగ్రెస్ హయాంలో సర్జికల్ దాడులు జరిగిన విషయం టెర్రరిస్టులకు తెలియలేదు. వాళ్లపై దాడిచేసిన వాళ్లకు తెలియలేదు. పాకిస్థాన్ కు ఏమాత్రం సమాచారం లేదు. చివరికి సొంత భారతీయులకు కూడా ఈ విషయం తెలియలేదు. యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రెయిక్ జరిగినట్లు మీరు(ప్రజలు) ఎప్పుడైనా విన్నారా? బీజేపీ ప్రభుత్వం వచ్చాక పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన సర్జికల్ దాడులను దేశమంతా చూసింది’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Related Posts