YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పంజాబ్ ఆగ్రోస్ ఫుడ్ యూనిట్ ను సందర్శించిన తెలంగాణ ఆగ్రోస్ అధికారులు

పంజాబ్ ఆగ్రోస్ ఫుడ్ యూనిట్ ను సందర్శించిన తెలంగాణ ఆగ్రోస్ అధికారులు

;పంజాబ్ రాష్ట్రం, హోషియర్ పూర్ జిల్లాలో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్ర ఆగ్రోస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, జ్యూస్ యూనిట్ ను తెలంగాణ ఆగ్రోస్ కార్పోరేషన్ అధికారులు సందర్శించారు....పంజాబ్ ఆగ్రోస్ వారు చేస్తున్న ఆగ్రోస్ ఫుడ్ ప్రాసెస్సింగ్ మరియు పండ్లు, కూరగాయాల రసంల కర్మాగారములు పరిశీలించి పెట్టుబడి, మార్కెటింగ్ , కార్పోరేషన్ కు రెవెన్యూ లాభాలు, యంత్రముల పైన  వివిధ అంశములు పైన  పూర్తిగా చర్చించి, పంజాబ్ ఆగ్రోస్ తయారు చేయు  ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు పరిశీలించి వీటన్నింటి పైన తెలంగాణ ఆగ్రోస్ కార్పోరేషన్ కూడా ఒక కార్యాచరణ రూపొందించి  సంస్ధను అభివృద్ధి పథంలో నడిపించుటకు ఈ పర్యటన  దోహద పడుతుందని భావిస్తున్నాం. పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు , ఎండి సురేందర్   మరియు జనరల్ మేనేజర్ చంద్ర రాజామోహన్ పాల్గొన్నారు.

Related Posts