YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

చెన్నైపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన ముంబై

  చెన్నైపై గెలిచి  ఫైనల్లోకి ప్రవేశించిన ముంబై

యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:

చెన్నైని చెన్నైలో ఓడించడం చాలా కష్టం. అలాంటిది చెన్నైని దాని సొంతగడ్డపై ఈ ఐపీఎల్‌లో రెండోసారి మట్టికరిపించింది ముంబయి ఇండియన్స్‌. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1లో ముంబయి 6 వికెట్ల తేడాతో గెలిచింది. స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌ (2/14), కృనాల్‌ పాండ్య (1/21), జయంత్‌ యాదవ్‌ (1/25) మాయాజాలానికి తడబడిన చెన్నై మొదట 4 వికెట్లకు 131 పరుగులే చేసింది. రాయుడు (42 నాటౌట్‌; 37 బంతుల్లో 3×4, 1×6), ధోని (37 నాటౌట్‌; 29 బంతుల్లో 3×6) రాణించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (71 నాటౌట్‌; 54 బంతుల్లో 10×4) సూపర్‌ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ముంబయి.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. సూర్యకుమార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో చెన్నైతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబయి గెలవడం విశేషం.

 

Related Posts