YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్ ఘడ్ లో ఎదురు కాల్పులు..ఇద్దరు మావోయిస్టుల మృతి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ అడవుల్లో బుధవారం ఉదయం 5 గంటలకు మావోయిస్టులకు, సాయుధ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దంతెవాడ అటవీప్రాంతం అరన్పూర్ పోలీసుస్టేషను పరిధిలోని గొండేరాస్ జంగిల్ ప్రాంతంలో సాయుధ పోలీసులు గాలిస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. తిరిగి పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల మృతదేహాల వద్ద ఒక రైఫిల్, 12బోర్ తుపాకీ, మందుగుండు సామాగ్రి, తీవ్రవాద సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts