YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బాలికపై 51 రోజుల గ్యాంగ్ రేప్

బాలికపై 51 రోజుల గ్యాంగ్ రేప్
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా.. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగడుతూనే ఉన్నారు. దేశంలో ఏదో ఒక మూలన ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా నోయిడా సమీపంలోనూ దారుణం జరిగింది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 51 రోజులు బాధితురాలికి టార్చర్ చూపించారు.. తర్వాత కామాంధుల నుంచి చాకచక్యంగా తప్పించున్న బాలిక తల్లిదండ్రులకు చెప్పగా.. వారు పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. నోయిడా శివారులో బాలిక కుటుంబం నివాసముంటుండగా.. ఆమె తండ్రి దగ్గరలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బాలికకు చదువు రాకపోవడంతో.. ఇంటి దగ్గరే ఉంటూ చిన్న, చిన్న పనులు చేసుకుంటోంది. రెండు నెలల క్రితం బాలిక ఉంటున్న ఇంటి పక్కనే ఇద్దరు యువకులు ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తర్వాత బాలికతో మాట కలిపి పరిచయం పెంచుకున్నారు. మార్చి 2న ఆమెకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లి.. ఓ గదిలో బంధించారు. బాలికను గదిలో బంధించిన ఇద్దరు యువకులు.. మరో స్నేహితుడితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక ప్రాధేయపడినా వదలకుండా నరకం చూపించారు. పారిపోతే చంపేస్తామని బెదిరించడంతో.. ఆమె భయపడింది. ఆ నరకం నుంచి బయటపడాలని భావించి ధైర్యం చేసింది. ఏప్రిల్ 22న ఆ గది నుంచి తప్పించుకొని నేరుగా ఇంటికి చేరుకుంది. జరిగిన ఘోరాన్ని తండ్రికి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు ధైర్యం చెప్పిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో బాలిక తండ్రి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. బాలికను వైద్య పరీక్షల కోసం పంపించి.. ఆమె షాక్‌లో ఉండటంతో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అయితే బాలిక తండ్రి నిందితులతో సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు

Related Posts