YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వారంలో వరుసగా నాలుగో రోజు.. మొత్తంగా 7వ రోజు నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 
పాయింట్లకు పైగా పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఆరంభంనుంచీ బలహీనంగా కదిలిన మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి కారణంగా ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ ఏకంగా 
రెండు నెలల కనిష్ఠానికి పతనమైంది. అమెరికా-చైనా చర్చల ప్రభావం ఆసియా మార్కెట్లతోపాటు, అమెరికా, యూరప్ మార్కెట్లపైనా స్పష్టం కనిపించింది. నేటి ట్రేడింగ్‌లో చైనా మార్కెట్లు 1.8శాతం, 
కొరియా మార్కెట్లు 3 శాతం పతనమయ్యాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 230.22 పాయింట్లు క్షీణించి 37,558.91 వద్ద, నిఫ్టీ 57.65 పాయింట్ల నష్టంతో 11,301.80 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 23 పైసలు క్షీణించి 69.94 వద్ద కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్‌లో మీడియా షేర్ల సూచీ 3 శాతం పెరగ్గా, మెటల్‌ సూచీ 1.4 శాతం క్షీణించింది. యస్‌బ్యాంక్‌ షేర్లు 2.5 శాతం పతనమయ్యాయి. ఇండియా రేటింగ్స్‌ సంస్థ ఈ బ్యాంక్‌ దీర్ఘకాలిక రేటింగ్స్‌కు కోత విధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇక ఇతర సూచీల్లో 
పెద్ద మార్పు లేదు.ఎన్‌ఎస్‌ఈలో.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ (+7.93), యస్ బ్యాంక్‌ (+5.94), బజాజ్‌ ఫిన్‌‌సర్వ్‌ (+1.65), బజాజ్‌ ఫైనాన్స్‌ (+1.71), హీరో మోటో కార్ప్‌ (+1.52) షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. వీటితోపాటు ఐబీ హౌసింగ్, టైటన్‌, టెక్‌ మహీంద్రా, గెయిల్‌, బ్రిటానియా షేర్లు లాభాలను ఆర్జించాయి. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (-3.31), బీపీసీఎల్‌ (-3.09), భారతీ ఎయిర్‌టెల్ (2.79), కోల్‌ ఇండియా (-2.73), ఎన్టీపీసీ (2.73) టాప్‌ లూజర్స్‌‌గా మిగిలాయి. వీటితోపాటు ఏషియన్‌ పెయింట్స్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్‌‌లో యస్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హీరోమోటోకార్ప్, హెచ్‌యూఎల్, టీసీఎస్ టాప్ గెయినర్లుగా.. రిలయన్స్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్ టాప్ లూజర్లుగా ఉన్నాయి.  

Related Posts