YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఎపి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నూతన డైరీని విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు.

Highlights

  • ఎపి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ కామెంట్స్ 
  • ఎపియుడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించడం సంతోషంగా‌ఉంది
ఎపి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నూతన డైరీని విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు.

ఎపి డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ నూతన డైరీని విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు.  ఇందులో ఐజెయు ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంచల జయరాజ్, ఇతర ఎపియుడబ్ల్యూజే నేతలు పాల్గొన్నారు.

అన్ని రంగాలు విలువలు కోల్పోతున్నాయి. పత్రికా రంగం, ప్రసార మాధ్యమాలు విలువలు కోల్పోకూడదు. వార్తల విషయంలో ప్రజల నాడి తెలుసుకోవాలి. పత్రికా, ప్రసార మాధ్యమాల పై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడం బాధాకరం. భాషను, సంస్కృతిని నిలిపేది పత్రికా, ప్రసార‌మాధ్యమాలే.

రాజధానిలో మంచిని ప్రోత్సహిస్తూ చెడును తరిమికొడుతూ జర్నలిస్టులు సమాజంలో మార్పు తెచ్చేందుకు క్రుషి చేయాలి. జర్నలిస్టుల ఇండ్ల స్ధలాలపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఏ విధమైన సౌకర్యాలు వచ్చాయో ఎపి రాజధానిలో కూడా వస్తాయని ఆశిస్తున్నా. అమరావతి జర్నలిస్టుల శిక్షణా తరగతులకు స్పీకర్ తో చర్చించి ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.

 

 

Related Posts