YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భార్యకు 59 కత్తిపోట్లు

భార్యకు 59 కత్తిపోట్లు
భార్యపై కోపంతో ఆమెను అతి కిరాతకంగా చంపేశాడో భర్త. కత్తితో ఏకంగా 59పార్లు పొడిచి కసిదీరా ప్రాణం తీశాడు. గతేడాది క్రిస్‌మస్ రోజున ఈ జరిగిన ఈ దారుణంపై విచారించిన లండన్ కోర్డు నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు చెప్పిన విషయాలు విని న్యాయమూర్తి షాకయ్యారు. భారత సంతతికి చెందిన ఏంజెలా మిట్టల్(41) తన భర్త లారెన్స్ బ్రాండ్(47)తో కలిసి లండన్‌లో నివాసముండేది. గతేడాది క్రిస్మస్ రోజు దంపతులిద్దరికీ తీవ్రస్థాయిగా వాగ్వాదం జరిగింది. దీంతో లారెన్స్ కోపంతో కత్తితో భార్యను గట్టిగా పొడిచాడు. అంతటితో అతడి కోపం ఆగక ఆమె చనిపోయే వరకు శరీరంలో పొడుస్తూనే ఉన్నాడు. కత్తి విరిగిపోతే మరో కత్తి తీసుకుని పొడుస్తూనే ఉన్నాడు. చివరికి తీవ్ర రక్తస్రావంతో ఏంజెలా చనిపోయిన తర్వాత లారెన్స్ పోలీసులకు స్వయంగా ఫోన్ చేసి తన భార్యను హత్య చేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. దర్యాప్తులో వెల్లడైన విషయాలతో దర్యాప్తు అధికారులు షాకయ్యారు. లారెన్స్ తన భార్యను 59సార్లు పొడిచినట్లు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి కూడా విచారణలో భాగంగా నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక కత్తి ఇరిగిపోతే మరో కత్తి తీసుకొచ్చి పొడిచావంటే ఆ సమయంలో ఆమె ఎంత నరకాన్ని అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు’ అని జడ్జి ఆవేదన వ్యక్తం చేశారు. లారెన్స్‌ నేరాన్ని నిర్ధారిస్తూ జీవితఖైదు విధించారు. కోర్టు లారెన్స్‌కు జీవితఖైదు విధించడంతో ఏంజెలా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

Related Posts