YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కమల్ పై కేసు

కమల్ పై కేసు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ ఇబ్బందుల్లో పడ్డారు. తమిళనాడులో ఈ నెల 12న ఓ కార్యక్రమం సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. దేశంలో తొలి ఉగ్రవాది హిందువేనని వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీని చంపిని నాథూరాం గాడ్సేనే స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దీంతో కమల్ హాసన్ పై కేసు నమోదు అయింది. కమల్ హాసన్ హిందూ మతాన్ని ఉగ్రవాదానికి ముడిపెట్టడం ద్వారా తమ మనోభావాలను దెబ్బతీశారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ పిటిషన్ పై పటియాలా కోర్టు రేపు విచారణ జరిపే అవకాశముందని కోర్టు వర్గాలు తెలిపాయి.

Related Posts