YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గోవా బీచ్ లో తెలుగు డాక్టర్ దుర్మరణం

 గోవా బీచ్ లో తెలుగు డాక్టర్ దుర్మరణం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

గోవా బీచ్ లో  కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన వైద్యురాలు ఊటుకూరు రమ్యకృష్ణ ప్రమాదవశాత్తు మృతిచెందారు. బీచ్ లో  సెల్ఫీ తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన కెరటాల్లో ఆమె కొట్టుకుపోయారు. బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోవాలోని ప్రభుత్వ అనుబంధ వైద్య సంస్థలో వైద్యురాలిగా పనిచేస్తున్న రమ్యకృష్ణ గోవా బీచ్లో సెల్ఫీ తీసుకుంటుండగా సముద్రపు అలలు ఉద్ధృతంగా వచ్చి ఆమెను కొట్టుకుపోయాయి. జగ్గయ్యపేట పట్టణంలోని మార్కండేయ బజార్ కు చెందిన రమ్యకృష్ణకు తల్లి, సోదరులు, సోదరి ఉన్నారు. గతేడాది వరకు జగ్గయ్యపేట ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా పనిచేసిన రమ్యకృష్ణ  గతేడాది గోవాలో ఉద్యోగం రావడంతో అక్కడికివెళ్లారు. పట్టణంలో సుపరిచితురాలైన రమ్యకృష్ణ మృతితో స్థానికంగా విషాదం నెలకొంది

Related Posts