YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైల్వే టిక్కెట్లలలో సగం రాయితీ

 రైల్వే టిక్కెట్లలలో సగం రాయితీ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

బస్సు ప్రయాణం కన్నా రైల్వే జర్నీకి ప్రాధాన్యమిచ్చే వారు చాలా మందే ఉంటారు. మరీముఖ్యంగా వేసవి సెలవుల్లో రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి. అందుబాటు ధరలు, టికెట్లపై తగ్గింపు వంటి అంశాలు ఇందుకు కారణం.ఐఆర్‌సీటీసీ.. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు, విద్యార్థులు, డాక్టర్లు, మీడియాకు చెందిన వారు, క్రీడాకారులకు, యుద్ధంలో భర్తను కోల్పోయిన మహిళలు.. చాలా పలువురికి టికెట్ ధరల్లో రాయితీలు అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ ట్రైన్ టికెట్ ధరలో ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. 60 ఏళ్ల లేదా ఆపైన వయసు కలిగిన మగ వారు, 58 ఏళ్ల లేదా ఆపై వయసు ఉన్న ఆడ వారు అన్ని రకాల తరగతుల ప్రయాణానికి ఈ తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. మెయిల్, ఎక్స్‌ప్రెస్, రాజధాని, శతాబ్ది, జన్ శతాబ్ది వంటి ట్రైన్లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ఐఆర్‌సీటీసీ ఈ-టికెటింగ్ వెబ్‌సైట్‌లోకి సీనియర్ సిటిజన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్స్‌పై రాయితీని పొందొచ్చు. అలాగే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్స్, రిజర్వేషన్ కార్యాలయాల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. ట్రైన్ టికెట్ ధరపై మగ వారు 40 శాతం వరకు, ఆడ వారు 50 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. రైల్వే టికెట్ బుకింగ్‌పై రాయితీ పొందిన వారు ట్రైన్‌లో ప్రయాణం చేసేటప్పుడు కచ్చితంగా వయసు ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.

Related Posts