YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

దిగొస్తున్న బంగారం, వెండి ధరలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

గురువారం పెరిగిన పసిడి ధర శుక్రవారం మళ్లీ పడిపోయింది. దేశీ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.33,170కు క్షీణించింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం సహా బలహీన అంతర్జాతీయ ట్రెండ్ ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.625 పతనమై రూ.37,625కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్ మార్కెట్‌లో కూడా బంగారం ధర ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 1,285.65 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.50 శాతం క్షీణతతో 14.46 డాలర్లకు దిగొచ్చింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.33,170కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 తగ్గుదలతో రూ.33,000కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది.కేజీ వెండి ధర రూ.625 పతనంతో రూ.37,625కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.702 తగ్గుదలతో రూ.36,822కు దిగొచ్చింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.32,110కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,580కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.39,700కు దిగొచ్చింది 

Related Posts