YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

భారీ లాభాలతో మార్కెట్లు

 భారీ లాభాలతో మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

ఇండియన్ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్లింది. ఏకంగా 500 పాయింట్లకు పైగా ర్యాలీ చేసింది. సెన్సెక్స్ 537 పాయింట్లు లాభపడింది. 37,931 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 150 పాయింట్ల లాభంతో 11,407 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ముందు మార్కెట్ భారీగా పెరగడం గమనార్హం. నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ, హీరో మోటొకార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ముగిశాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 8 శాతానికి పైగా పెరిగింది. బజాజ్ ఫైనాన్స్ 6 శాతం లాభపడింది. అదేసమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, యస్ బ్యాంక్, ఐఓసీ, వేదాంత, హిందాల్కో, సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యస్ బ్యాంక్ షేర్లు 3 శాతం పడిపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. ఫార్మా ఇండెక్స్ 1.5 శాతం నష్టపోయింది. మరోవైపు ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా పెరిగాయి. మీడియా ఇండెక్స్ 3 శాతానికి పైగా ర్యాలీ చేసింది.

Related Posts