YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వారానికొక రోజు తమ ముందు హాజరుకావాలి సాధ్వి ప్రజ్ఞాకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం

 వారానికొక రోజు తమ ముందు హాజరుకావాలి           సాధ్వి ప్రజ్ఞాకు ఎన్ఐఏ కోర్టు ఆదేశం
భోపాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ వివాదాస్పద నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు ఎన్ఐఏ కోర్టు షాక్ ఇచ్చింది. సాధ్వితో పాటు కేసులో ఉన్న ఇతర నిందితులంతా వారానికి ఒక రోజు తమ ముందు హాజరు కావాలని ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన కారణాలు చూపకుండా కోర్టు హాజరు నుంచి మినహాయింపును ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను మే 20వ తేదీకి వాయిదా వేసింది.సాధ్వితో పాటు ప్రసాద్ పురోహిత్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పై ఉన్నారు. వీరిపై ఉగ్ర కార్యకలాపాలు, హత్య, నేరాలకు పథక రచన చేయడం వంటి అభియోగాలను ఎన్ఐఏ మోపింది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసులో ఆమె నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. 

Related Posts