YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేదార్ నాధుడ్ని దర్శించుకున్న మోడీ

కేదార్ నాధుడ్ని దర్శించుకున్న మోడీ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ప్రముఖ జ్యోతిర్లింగ్ క్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం దర్శించుకున్నారు. ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో కేదార్‌నాథ్‌కు చేరుకున్న మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని, తర్వాత గర్భగుడిలోకి వెళ్లి శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. సుమారు 20 నిమిషాల సేపు ప్రత్యేక పూజలు చేసిన మోదీ, తరువాత ఆలయం వెలుపలకు వచ్చి ప్రదక్షిణలు చేశారు. ఈ సమయంలో బయట ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధానికి ఆలయ అర్చకుడు ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక వేషధారణలో కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ సందర్శించడం విశేషం. ప్రధాని ఆదివారం బ‌ద్రీనాథ్ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. అక్కడ బదరీనారాయణునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి 11,755 అడుగుల ఎత్తులో ఉన్న కేదార్‌నాథ్ ఆలయం వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ప్రఖ్యాత ఆలయాన్ని మోదీ ఇప్పటి వరకు నాలుగు సార్లు దర్శించుకోవడం విశేషం. అంతేకాదు, తొలిసారి మే 2017లో కేదార్‌నాథ్ వెళ్లిన మోదీ, గడచిన 28 ఏళ్లలో దర్శించుకున్న తొలి ప్రధానిగా రికార్డులకు ఎక్కారు. 1989లో అప్పటి ప్రధాని వీపీ సింగ్ ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత మోదీయే కేదార్‌నాథ్‌ను దర్శించారు. హిమగిరుల్లో కొలువున్న ఈ ఆలయాన్ని శీతాకాలంలో మంచు కారణంగా దర్శించుకోవడం వీలుకాదు. అందువల్ల ఏటా చలికాలంలో ఆలయాన్ని మూసి, తిరిగి వేసవిలో తెరుస్తారు. ఈ ఏడాది మే 9న ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక, తుది విడత సార్వత్రిక ఎన్నికలకు శుక్రవారమే ప్రచారం ముగియడం, పోలింగ్‌కు ముందు రోజు కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ దర్శించుకోవడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు వస్తుందని ఆరోపిస్తున్నాయి. అయితే, ఈసీ మాత్రం ఈ పర్యటనకు అనుమతినివ్వడం గమనార్హం.
రాత్రంతా గుహలోనే...
కేదార్ నాధ్ డెవల‌ప్‌మెంట్ ప‌నుల‌ను స‌మీక్షించిన త‌ర్వాత మోదీ అక్క‌డ ఓ గుహ‌లోకి వెళ్ల‌నున్నారు. ఆ గుహ‌లోనే ఇవాళ మోదీ అక్క‌డే ధ్యానం చేయ‌నున్నారు. రాత్రంతా అదే గుహ‌లో గ‌డ‌ప‌నున్నారు. సుమారు 20 గంట‌ల పాటు ధ్యాన గుహ‌లోనే మోదీ ఉంటార‌ని ప్రాథ‌మికంగా స‌మాచారం అందింది.సాయంత్రం జ‌రిగే హార‌తి కార్య‌క్ర‌మంలోనూ మోదీ పాల్గోన్నారు.. ప్ర‌స్తుతం అక్క‌డ స్వ‌ల్పస్థాయి వ‌ర్షం కురుస్తోంది. మ‌ధ్యాహ్నాం కొంత సేపు సేద‌తీరిన త‌ర్వాత మోదీ ధ్యాన గుహ వైపు వెళ్లారు. వ‌ర్షంలోనే మోదీ గుహ‌లోకి వెళ్లారు. ఆల‌యం నుంచి సుమారు 1.5 కిలోమీట‌ర్ల దూరంలో ఆ గుహ ఉన్న‌ది. ఆ గుహ అయిదు మీట‌ర్ల పొడుగు, మూడు మీట‌ర్ల ఎత్తు ఉన్న‌ది. ఎనిమిదిన్న‌ర ల‌క్ష‌లు పెట్టి ఆ గుహ‌ను తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని మోదీ త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. హెలికాప్ట‌ర్ నుంచి కేదార్‌నాథ్ క్షేత్రాన్ని ఫోటోలో బంధించారు. అద్భుత శిఖ‌రాలంటూ ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. వాస్త‌వానికి ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి తీసుకుని మోదీ ... కేదార్‌నాథ్ వెళ్లారు. ఎటువంటి స‌మావేశాలు నిర్వ‌హించ‌డం కానీ, హామీలు ఇవ్వ‌డం కానీ చేయ‌కూడ‌దంటూ ఈసీ ఆదేశించింది. ఆదివారం చివ‌రి ద‌శ లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మోదీకి ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ మోదీ రాక సంద‌ర్భంగా భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. మోదీ ఆదివారం బ‌ద్రీనాథ్ వెళ్తారు.

Related Posts