YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారి తలనీలాలకు రూ.2.38 కోట్లు

Highlights

  • తలనీలాల వేలం ద్వారా రూ.2.38 కోట్లు
  • ప్రతినెలా మొదటి గురువారం ఈ–వేలం 
శ్రీవారి తలనీలాలకు రూ.2.38 కోట్లు

తిరుమలలో కొలువైన కలియుగ  శ్రీ వెంకటేశ్వరస్వామికి భక్తులు తమ కోర్కెల మేరకు సమర్పించే తలనీలాల ద్వారా శ్రీవారికి రూ.2.38 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతినెలా మొదటి గురువారం ఈ–వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తున్నారు. ఈసారి మొత్తం 3,500 కిలోలు తలనీలాలు అమ్ముడు పోయాయి. 5వ రకం, తెల్లవెంట్రుకలు పూర్తిగా అమ్ముడుకాలేదు. ఒకటో రకం కిలో రూ.22,494 చొప్పున 500 కిలోలు విక్రయించగా రూ.1.12 కోట్ల ఆదాయం వచ్చింది.రెండో రకం కిలో రూ.17,223 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.51.67 లక్షలు, మూడో రకం కిలో రూ.2,833 చొప్పున 2,400 కిలోలు విక్రయించగా రూ. 69.61 లక్షలు, నాలుగో రకం కిలో రూ.1,195 చొప్పున 300 కిలోలు విక్రయించగా రూ.4.41 లక్షలు ఆదాయం సమకూరిందని టీటీడీ అధికారులు వర్గాలు పేర్కొంటున్నాయి.

Related Posts