YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మే 23 తర్వాతే నిర్ణయం : డీఎంకే

మే 23 తర్వాతే నిర్ణయం : డీఎంకే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని నిన్నటి ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీఏ పక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఏ కూటమిలో చేరే విషయాన్ని ఎన్నికల ఫలితాల తర్వాతే తాము నిర్ణయిస్తామని తెలిపారు. మే 23 సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని, ఇప్పుడే, ఢిల్లీలో యూపీఏ పక్ష పార్టీలతో సమావేశం జరపడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు యూపీఏ పక్ష పార్టీల్లో చర్చనీయాంశమైనట్టు సమాచారం. కాగా, బీజేపీ వ్యతిరేక పక్షాలు మాత్రం వరుస భేటీలు జరుపుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.  తమిళనాట స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే స్వీప్ చేయబోతోందని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైన సంగతి తెలిసిందే. తమిళనాడులో మొత్తం 39 పార్లమెంటు స్థానాలు ఉండగా... భారీ ఎత్తున నగదు పట్టుబడటంతో... వేలూరు నియోజకర్గంలో పోలింగ్ ను ఈసీ ఆపేసింది. మిగిలిన 38 సీట్లలో డీఎంకేకు 27 నుంచి 34 సీట్లు వస్తాయని వివిధ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి 11 వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ అబద్ధాలే అని ఆయన అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నాడీఎంకే కూటమి మొత్తం 39 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.014 సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేకు భంగపాటు తప్పదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే, వాటి అంచనాలను తలకిందులు చేస్తూ అన్నాడీఎంకే ఏకంగా 37 సీట్లను కైవసం చేసుకుని... అందరికీ షాక్ ఇచ్చింది.

Related Posts