YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గాడ్సే వివాదం... కమల్ కు బెయిల్

గాడ్సే వివాదం... కమల్ కు బెయిల్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మహాత్మగాంధీని హత్య చేసిన గాడ్సేపై వ్యాఖ్యల వివాదంలో మక్కల్‌ నీది మయ్యం చీఫ్ కమల్‌ హాసన్‌ కు ఊరట లభించింది. సోమవారంమద్రాసు హైకోర్టు(మదురై బెంచ్‌)కమల్ కు ముందస్తు బెయిల్‌  మంజూరు చేసింది.
ఇటీవల తమిళనాడులోని కరూర్ జిల్లాలోని అరవకురిచి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కమల్ హాసన్...స్వతంత్ర భారతంలో తొలి తీవ్రవాది ఓ హిందువు. ఆయన పేరు నాథూరామ్‌ గాడ్సే అని అన్నారు. కమల్‌ వ్యాఖ్యలపై హిందూ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కంప్లెయింట్ చేశారు.
కమల్‌ కు వ్యతిరేకంగా 76 ఫిర్యాదులు రాగా....రెండు కేసులు నమోదయ్యాయి.అయితే ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో కమల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, తీవ్రవాదులు అన్ని మతాల్లో ఉన్నారని చెప్పే ప్రయత్నంలోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు కమల్‌ తెలిపారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం  కమల్‌ ను అరెస్టు చేయకుండా ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Related Posts