YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

కలకలం రేపుతోన్న ఆరెస్సెస్ నేతతో గడ్కరీ భేటీ..

కలకలం రేపుతోన్న ఆరెస్సెస్ నేతతో గడ్కరీ భేటీ..

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఎగ్జిట్ పోల్స్ వెలువడిన మరుసటి రోజు ఆరెస్సెస్ నేత భయ్యాజీ జోషితో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సమావేశం కలకలం రేపుతోంది. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే జరిగిందని గడ్కరీకి సంబంధించివారు చెబుతున్నారు. రానున్న ప్రభుత్వంలో గడ్కరీ పాత్ర ఏమిటనే విషయంపై చర్చించారని తెలిపారు. గడ్కరీకి కీలకమైన పదవిని అప్పజెప్పే అవకాశం ఉందని చెప్పారు.దాదాపు రెండు గంటల సేపు వీరి సమావేశం కొనసాగింది. ఆరెస్సెస్ తో గడ్కరీకి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.ఇదే సమావేశంలో పాల్గొన్న మరో బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై చర్చ జరిగిందని చెప్పారు. మరోవైపు 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం పోస్టర్ విడుదల సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ, ప్రధాని రేసులో తాను లేనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మోదీ నాయకత్వంలోనే తాము ఎన్నికల ప్రచారానికి వెళ్లామని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ జోషితో గడ్కరీ సమావేశం కొత్త చర్చకు దారి తీసింది.

Related Posts