YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు: ఈసీపై ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు

ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారు: ఈసీపై ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారత ఎన్నికల సంఘం(ఈసీ)పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. దేశంలోని విపక్ష పార్టీల నేతలంతా ఈసీ తీరుపై మండిపడుతున్న వేళ... భారత ఎన్నికల సంఘం(ఈసీ)పైమాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు.. సార్వత్రిక ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని కితాబిచ్చారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 'మన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందంటే దానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ కారణం. సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వరకు ప్రతి ఒక్కరూ తమ విధులను చాలా గొప్పగా నిర్వహించారు. ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదు' అని ప్రణబ్ దాదా చెప్పారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఎన్నో ఏళ్లుగా బలంగా నిర్మించబడుతూ వస్తున్నాయి... అన్ని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు.

Related Posts