YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కౌంటింగ్ తర్వాత యోగా కేబినెట్ విస్తరణ

కౌంటింగ్ తర్వాత  యోగా కేబినెట్ విస్తరణ

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు పనితీరు సరిగాలేవని వారికి ఉద్వాసన పలికి ఆశావహులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2017 మార్చిలో ఏర్పడిన రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు విస్తరణ చేపట్టలేదు. యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంలో మొత్తం 46 మందికి మంత్రి వర్గంలో అవకాశం ఉంది. అందులో ఇప్పటికే 14 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో నలుగురు మంత్రులు ఎంపీలుగా పోటీ చేశారు. ఒకవేళ ఆ నలుగురు పార్లమెంట్‌కు ఎంపికైతే మరో నాలుగు స్థానాలు ఖాళీ అవుతాయి. దీంతో మంత్రి పదవుల ఖాళీల సంఖ్య మొత్తం 18కి చేరుకుంటుంది. కేబినెట్‌ విస్తరణపై ముఖ్యమంత్రిని ప్రశ్నించగా.. ఎన్నికలు పూర్తైన తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. కేబినెట్‌ విస్తరణ సమయంలో ఆయా మంత్రుల నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Related Posts