YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

స్వల్ప లాభాలతో మార్కెట్లు

స్వల్ప లాభాలతో మార్కెట్లు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

దేశవ్యాప్తంగా ఎన్నికల మేనియా నెలకొన్న తరుణంలో స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. రేపు ఫలితాలు వెలువడనుండడంతో ట్రేడర్లు ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నారు. కొనుగోళ్లు, అమ్మకాలు కూడా ఎంతో మందకొడిగా సాగాయి. ఈ నేపథ్యంలో, బీఎస్ఈ సెన్సెక్స్ 117 పాయింట్ల స్వల్ప లాభంతో 39,087 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 25 పాయింట్ల కనిష్ట లాభంతో 11,735 వద్ద క్లోజయింది. మధ్యాహ్నం సెషన్ తర్వాత నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ లు పతనం దిశగా సాగాయిఅన్నింటికంటే ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే, కొంతకాలంగా నష్టాలతో సహవాసం చేస్తున్న జెట్ ఎయిర్ వేస్ కు మంచిరోజులు వస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ షేర్లకు గిరాకీ ఏర్పడింది. వరుసగా మూడో రోజు కూడా జెట్ ఎయిర్ వేస్ షేర్లు లాభాల బాటలో పయనించాయి. వారం రోజుల వ్యవధిలో జెట్ షేర్ల లాభాల్లో 32 శాతం పెరుగుదుల నమోదైంది

Related Posts