YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆధిక్యంలో మోడీ

ఆధిక్యంలో మోడీ

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో భాజపా దూసుకెళుతోంది. గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అత్యధిక స్థానాల్లో కాషాయ పార్టీ ఆధిక్యంలో ఉంది. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెనుకబడ్డారు. భాజపా అభ్యర్థి స్మృతీ ఇరానీ ముందంజలో ఉన్నారు. కేరళలోని వయనాడ్లో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. గుజరాత్లోని గాంధీ నగర్లో భాజపా అధ్యక్షుడు అమిత్షా ఆధిక్యంలో ఉన్నారు. రాయ్బరేలీలో సోనియా గాంధీ ముందంజలో ఉన్నారు.

Related Posts