YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఓటమి పాలైన మాజీ ప్రధాని దేవెగౌడ

  ఓటమి పాలైన మాజీ ప్రధాని దేవెగౌడ

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:     

కర్ణాటక రాజకీయాల్లో హసన్‌, మండ్య, తుమకూరు లోక్‌సభ నియోజక వర్గాలపై ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ మూడు స్థానాల్లో మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబానికి చెందిన వారు పోటీకి దిగారు. అయితే, తుమకూరు నుంచి దేవెగౌడ ఓడిపోయారు. ఈ స్థానంలో భాజపా అభ్యర్థి బసవరాజ్‌ గెలుపొందారు. 1953లో కాంగ్రెస్ పార్టీలో చేరి తన రాజీకీయ జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన... అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.కర్ణాటక సీఎంగా,  భారత ప్రధానిగా కూడా విధులు నిర్వర్తించారు.  అంతేకాకుండా తన మనవడు నిఖిల్ గౌడ ఫై  స్వతంత్ర అభ్యర్థి సుమలత విజయం సాధించారు.

Related Posts