YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అద్వానీ, జోషిలకు మోడీ పాదాభివందనం

అద్వానీ, జోషిలకు మోడీ పాదాభివందనం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ.. పార్టీ సీనియర్ నేతలను కలిశారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వాణీ, సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ
ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కలిసి శనివారం (మే 24) ఉదయం ఈ నేతల ఇంటికి వెళ్లిన మోదీ.. వారితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు.
శనివారం ఉదయం ఆద్వాణీ ఇంటికి వెళ్లిన మోదీ, అమిత్ షా.. బీజేపీ విజయాన్ని ఆయనతో పంచుకున్నారు. పార్టీ తదుపరి కార్యాచరణ, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అంశాలపై కూడా ఆయనతో చర్చించినట్లు సమాచారం. అనంతరం అక్కడ నుంచి నేరుగా మురళీ మనోహర్‌ జోషీ నివాసానికి వెళ్లారు. ప్రధాని మోదీ, అమిత్‌ షాను జోషీ సాదరంగా ఆహ్వానించారు. ‘ఆడ్వాణీ లాంటి గొప్ప నేతలు దశాబ్దాలుగా పార్టీని బలోపేతం చేయడం, పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు ప్రభావవంతంగా చేరవేయడం వల్లే నేడు బీజేపీ ఈ విజయాన్ని సాధించగలిగింది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. అద్వాణీతో భేటీకి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో మురళీ మనోహర్ జోషీపై ప్రశంసలు కురిపించారు నరేంద్ర మోదీ. ‘డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషీ గొప్ప విద్యావేత్త. మేధో సంపత్తి, సమర్థత కలిగిన నేత. భారత విద్యా విధానాలను మెరుగుపరిచేందుకు ఆయన చేసిన సేవలు నిరూపమానం. బీజేపీని బలోపేతం చేసేందుకు ఆయన నిరంతరం కృషి చేశారు.
నాతో పాటు ఎంతో మంది కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. నేడు ఆయణ్ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నా’ అని మోదీ రాసుకొచ్చారు.ఎన్నికల సమయంలో తనకు తీవ్ర ఇబ్బంది కలిగేలా
వ్యాఖ్యలు చేసిన మురళీ మనోహర్‌ జోషీని కూడా ఆయన ఇంటికి వెళ్లి మరీ మోదీ కలవడం చర్చనీయాంశమైంది. రాజకీయ నేతల్లో తనది ఎలాంటి భిన్న వ్యక్తిత్వమో మోదీ మరోసారి నిరూపించారు.

Related Posts