YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

ముంబై హైవే రోడ్డులో బస్సు-కారు ఢీ

Highlights

  • ముగ్గురు మృతి
  • ఇరువురికి గాయాలు 
ముంబై హైవే రోడ్డులో బస్సు-కారు ఢీ

తెలంగాణలోని ముంబై హైవే  రోడ్డులో శుక్రవారం పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సంగారెడ్డికి సమీపంలోని కంది ఐఐటీ క్యాంపస్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు - కారు ఢీకొన్నాయి. వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఆర్టీసీ బస్సులోని పలువురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను సంగారెడ్డి వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో నరేందర్, నాగరాజు, మహేశ్వర్, వెంకట్ రెడ్డి ఉన్నారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. 

Related Posts