YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

స్మృతి ఇరానీ ప్రధాన అనుచరుడి హత్య

 స్మృతి ఇరానీ ప్రధాన అనుచరుడి  హత్య

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఇరానీ ప్రధాన అనుచరుడు అమేథిలో దారుణంగా హత్యకు గురి కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. జాము పోలీస్ స్టేషన్ పరిధిలో ఈఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బరోలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్, బీజేపీ స్థానిక నేతగా ఉంటూ, స్మృతి ఇరానీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయానికి తనవంతు కృషి చేశాడు. బరోలియాలోని తన ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి ఆయనపై తుపాకితో కాల్పులు జరిపారు. ఈ సమయంలో ఇంట్లో కుటుంబీకులు ఎవరూ లేరు. ఇది రాజకీయ హత్యేనని భావిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Related Posts