YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు : రాహుల్

రాజీనామాపై  వెనక్కి తగ్గేది లేదు : రాహుల్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తీవ్రంగా కలచిచేస్తోంది. ఓటమికి బాధ్యత వహించి ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమైన రాహుల్‌
గాంధీ.. నేతలు ఎంతగా వారిస్తున్నా పట్టు వీడకపోవడం పార్టీలో కల్లోలం రేపుతోంది. రాహుల్‌ను బుజ్జగించడానికి నేతలంతా ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ కూడా రంగంలోకి దిగారు.  కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్న‌ది. పార్టీ చీఫ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని రాహుల్ భీష్మించారు. దీంతో ఆ పార్టీ నేత‌లంతా రాహుల్‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇవాళ రాజ‌స్థాన్ డిప్యూటీ సీఎం స‌చిన్ పైల‌ట్‌తో పాటు సోద‌రి ప్రియాంకా గాంధీ వ‌ద్రా కూడా రాహుల్‌ను క‌లిశారు. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో స‌మూల ప్ర‌క్షాళ‌న చేప‌ట్టాల‌ని రాహుల్ భావిస్తున్నారు. దానికి సీనియ‌ర్ల అండ కూడా ల‌భిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం 4.30 నిమిషాల‌కు పార్టీ సీనియ‌ర్ల‌తో రాహుల్ స‌మావేశంకానున్నారు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు రాహుల్ మొండిగా సిద్దమయ్యారు. పార్టీ ప‌గ్గాల‌ను ప్రియాంకాకు అప్ప‌గిస్తారా అన్న అభిప్రాయాన్ని రాహుల్ కొట్టివేసిన‌ట్లు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలోని రాహుల్ నివాసంలో ఆ పార్టీకి చెందిన బ‌డా నేత‌లు క్యూక‌ట్టారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌కు కార‌ణ‌మైన ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్‌పై రాహుల్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. రాహుల్ నివాసానికి వెళ్లిన ప్రియాంక.. ఆయనతో మాట్లాడారు. పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రియాంక గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు పార్టీ సీనియర్ నేతలంతా రాహుల్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం రాజీనామా విషయంతో రాహుల్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామాకే మొగ్గు చూపుతున్న రాహుల్.. సోమవారం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌‌తో భేటీలోనూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. మరోవైపు.. పంజాబ్‌, ఝార్ఖండ్‌, అసోం పీసీసీ అధ్యక్షులు సునీల్‌ జాకర్‌, అజయ్‌ కుమార్‌, రిపున్‌బోరా తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ రాజీనామాలు ప్రకటించడం గమనార్హం. పార్టీలో ఏర్పడిన తాత్కాలిక సంక్షోభం కాంగ్రెస్‌ను కలకలానికి గురిచేస్తోంది. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో పార్టీ మరింత సంక్షోభంలో పడింది. ఎమ్మెల్యేలు చేజారి అధికారం కోల్పోయే ప్రమాదం దాపురించింది. దీంతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తమయ్యారు.పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో రాహుల్.. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదనే వార్తల నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీ నేతలు ఈ వార్తలను ఖండిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో సీడబ్ల్యూసీ మరోసారి భేటీ కానుంది. ఈలోగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం రాహుల్ అన్ని అపాయింట్‌మెంట్లను రద్దు చేసుకున్నారు. సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్‌ను సోమవారం ఉదయం రాహుల్‌ కలిసినట్టు తెలిసింది. రాజీనామాపై తన నిర్ణయాన్నివెనక్కి తీసుకునేది లేదని, మిగతా నేతలతో చర్చించి అధ్యక్ష పదవికి మరొకరిని వెతుక్కోవాలని స్పష్టం చేసినట్టు సమాచారం. అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబాన్ని మాత్రమే ప్రాతిపదికగా
తీసుకోవద్దని, సమర్థులైన వారిని ఎవరినైనా ఎంపిక చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. రాహుల్ రాజీనామా నిర్ణయం నేపథ్యంలో కొంత మంది ప్రియాంక గాంధీ పేరును తెరపైకి తీసుకురాగా.. తన సోదరిని ఇందులోకి లాగొద్దంటూ ఆయన ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు సోనియా, ప్రియాంక కూడా రాహుల్ నిర్ణయానికే మద్దతు పలుకుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొదట్లో రాహుల్ నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. ఆయన పరిస్థితి చూసి కొన్నాళ్ల పాటు ఈ ఒత్తిడికి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్టు సమాచారం.. అశోక్ గెహ్లాట్‌ను సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని రాహుల్ భావిస్తున్నారు. ఇదే అంశంపై చ‌ర్చించేందుకు గెహ్లాట్ ఇవాళ రాహుల్ ఇంటికి వెళ్లారు. ఒక‌వేళ రాహుల్ రాజీనామాను అంగీక‌రిస్తే, మ‌రి పార్టీ ప‌గ్గాలను ఎవ‌రు తీసుకుంటార‌న్న దానిపై క్లారిటీ లేదు. పార్టీ బాధ్య‌త‌లు ప్రియాంకా తీసుకుంటారా లేక గాంధీయేత‌ర నేత‌లు ఎవ‌రైనా ఆ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తారా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.
ఆ రెండు రాష్ట్రాల్లో సంక్షోభంలో సర్కార్లు కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంతో రాజస్థాన్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జర్కిహోలి, డాక్టర్ సుధాకర్ ఆదివారం బీజేపీ నేత ఎస్‌ఎం కృష్ణ ఇంటికి వెళ్లడం, పలువురు బీజేపీ నేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమిపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని.. వారు తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేయడంపై పలువురు మంత్రులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

Related Posts