YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీలోకి తృణ‌మూల్ పార్టీ ఎమ్మెల్యేలు

బీజేపీలోకి తృణ‌మూల్ పార్టీ ఎమ్మెల్యేలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

బెంగాల్‌లో తృణ‌మూల్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. బీజేపీ నేత ముఖుల్ రాయ్ కుమారుడు సుబ్ర‌గ‌న్షు రాయ్ బీజేపీలో చేరుతార‌ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుబ్ర‌గ‌న్షు రాయ్ త‌న‌కు చెందిన 15 మంది కౌన్సిల‌ర్ల‌తో ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. అక్క‌డ బీజేపీ నేత‌ల‌తో సుబ్ర‌గ‌న్షు మంత‌నాలు జ‌రుపుతున్నారు. బెంగాల్ నుంచి ప్ర‌స్తుతం ముగ్గురు టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీ చేరేందుకు సిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. బిజ్‌పూర్‌కు చెందిన సుబ్ర‌గ‌న్షుపై టీఎంసీ ఇటీవ‌ల ఆరేళ్ల స‌స్పెన్ష‌న్ విధించింది. పార్టీకి వ్య‌తిరేకంగా కామెంట్ చేశార‌ని ఆయ‌న‌పై చ‌ర్య తీసుకున్నారు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకున్న‌ది. దీంతో టీఎంసీ కార్య‌క‌ర్త‌లు బీజేపీ వైపు ఆక‌ర్షితుల‌వుతున్నారు. టీఎంసీ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల నిరాశ చెందిన దీదీ.. సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకునేందుకు సిద్ద‌మైన‌ట్లు చెప్పారు. కానీ అదో పెద్ద డ్రామా అని ముఖుల్ రాయ్ విమ‌ర్శించారు.

Related Posts