Highlights
- పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ వ్యూహంపై చర్చ
- ఎంపీలతో చర్చించనున్న సీఎం కేసీఆర్
- టీఆర్ఎస్ ఎంపీలకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగే ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ నెల 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్చలపై టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ లోక్ సభ, రాజ్యసభకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలకు ఈ మేరకు ఆహ్వానం అందింది.