YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డికి ఫోన్‌

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కిషన్‌రెడ్డికి ఫోన్‌

బీజేపీ నాయకుడు, సికింద్రాబాద్‌ ఎంపీ కిషన్‌రెడ్డికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. కేంద్రమంత్రిగా తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. కిషన్‌రెడ్డికి  ప్రధాని మోదీ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జనతాపార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన కిషన్‌రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌లీడర్‌గా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా  పనిచేశారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 

Related Posts