YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేసీఆర్.. జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

కేసీఆర్.. జగన్ ఢిల్లీ పర్యటన రద్దు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   

తెలంగాణ సీఎం కేసీఆర్, నవ్యాంధ్ర సీఎం జగన్ ఢీల్లీ పర్యటన రద్దైంది. వీరిద్దరికి ఢీల్లీలో రాత్రి 7గంటలకు జరిగే మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి. దీంతో జగన్ ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే ఇరువురు కలిసి ప్రత్యేక విమానంలో ఢీల్లీ వెళ్లాలని భావించారు. అయితే మోదీ ప్రమాణస్వీకారం నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా  గగన తల రాకపోకలపై ఆంక్షలు విధించారు అధికారులు. మధ్యాహ్నం 3 :30 తరువాత షెడ్యూల్ లో లేని ప్రత్యేక విమానాలు ఢిల్లీలో దిగేందుకు డిజిసిఎ, పౌర విమానయాన శాఖ అనుమతులు రద్దు చేసాయి.మోడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగానే షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆలస్యం కావడంతో  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన రద్దయింది.

Related Posts