YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మళ్లీ పడిపోయిన బంగారం ధర

మళ్లీ పడిపోయిన బంగారం ధర

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో 
 

రెండు రోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధర ఈ రోజు పడిపోయింది. దేశీ మార్కెట్‌లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,870కు క్షీణించింది. బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.75 పెరుగుదలతో రూ.37,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.43 శాతం తగ్గుదలతో 1,275.45 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.19 శాతం తగ్గుదలతో 14.38 డాలర్లకు దిగొచ్చింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,870కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,700కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది.కేజీ వెండి ధర రూ.75 పెరుగుదలతో రూ.37,400కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.80 తగ్గుదలతో రూ.36,095కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద స్థిరంగా ఉంది. 
 

Related Posts