YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మార్కులంటూ అమ్మాయిలతో రాసలీలలలు

మార్కులంటూ అమ్మాయిలతో రాసలీలలలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌లో సెక్స్ దందా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేస్తానని ప్రలోభపెట్టి కొందరు అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటున్నాడు. ఓ విద్యార్థిని ఫిర్యాదులో ఈ రాకెట్ వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఫరీదాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆ కాలేజీలో చదువుతున్న పలువురు అమ్మాయిలను చెరబట్టాడు. తన కోరికలు తీరిస్తే పరీక్షల్లో మార్కులు ఎక్కువ వేస్తానని ప్రలోభపెట్టాడు. చాలామంది విద్యార్థినులు మార్కుల ఆశతో అతడికి లొంగిపోయారు. దీంతో అతడి ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. అయితే ఇటీవల అదే కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఓ విద్యార్థినిని ఇదేవిధంగా వేధించాడు. దీంతో ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ ఘటన ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు తనను అరెస్ట్ చేస్తారని భావించిన నిందితుడు పరారై.. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దీనిపై విచారణను న్యాయస్థానం వాయిదా వేయడంతో పోలీసులు అతడిని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్న వ్యక్తి ఇంతటి నీచానికి పాల్పడ్డాడని తెలియడంతో అతడి సహోద్యోగులు, కాలేజీ విద్యార్థులు షాకవుతున్నారు. 
 

Related Posts