YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

జీఎస్పీ తొలగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్‌

 జీఎస్పీ తొలగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదు: ట్రంప్‌

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో 
 

భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) తొలగింపు విషయంలో వెనక్కి తగ్గేది లేదని ట్రంప్‌ పాలక వర్గం ప్రకటించింది. భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు ఇప్పటికే ‘జరిగిపోయిన ప్రక్రియ’ అని అధికారులు పేర్కొన్నారు. ‘‘జీఎస్పీ హోదా రద్దు ఒక జరిగిపోయిన అంశం. ఇక దీనిపై ముందుకు ఎలా వెళ్లాలన్నదే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. మోదీ ప్రభుత్వంతో ఎలా నడుచుకోవాలి, ఈ విషయంలో ఉన్న ఇతర పరిష్కార మార్గాలేంటి? అన్న దానిపై సమాలోచనలు జరపాలి’’ అని ట్రంప్‌ పాలక వర్గంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు మే 3తో ముగిసింది. అయితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు జీఎస్పీ రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరు యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు కోరడంతో దీనిపై తదుపరి 
నిర్ణయం ఆగిపోయింది. భారత్‌తో పాటు టర్కీకి కూడా విధించిన గడువు ముగియడంతో మే 17న ఆదేశానికి జీఎస్పీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో ‘సమానమైన, సర్థనీయమైన’ వాతావరణాన్ని  కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి హామీ లభించనందున భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు చేయాలని మార్చిలో కాంగ్రెస్‌కు ట్రంప్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్‌ అత్యధిక పన్నులు విధిస్తోందన్నది ట్రంప్‌ వాదన. మరోవైపు జీఎప్పీ తొలగింపు వల్ల భారత్‌ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండదని భారత్‌లోని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అఖండ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా.. మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి 
సంసిద్ధతను వ్యక్తం చేసిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

Related Posts