YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ కీలక నిర్ణయం

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ కీలక నిర్ణయం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:   
 

కాంగ్రెస్ పార్లమెంటరీ నేతగా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా పేరును ప్రతిపాదించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఎంపీలు సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. కాగా.. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు రాహుల్ విముఖుత చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు ఈ కీలక నిర్ణయం తీసుకుని.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

Related Posts