YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

త్రిపుర సీపీఎం నేత ఖగేంద్ర కన్నుమూత 

Highlights

 సీపీఎం శ్రేణుల్లో విషాదం
ఆరుసార్లు వరుసగా విజయం

త్రిపుర సీపీఎం నేత ఖగేంద్ర కన్నుమూత 

త్రిపుర రాష్ట్ర మత్స్య, కార్పొరేషన్ శాఖల మంత్రి, సీపీఎం నేత ఖగేంద్ర జమాటియా(64) కన్నుమూశారు. త్రిపుర అసెంబ్లీకి గత ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగగా.. ఆ మరుసటిరోజే ఖగేంద్ర తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఖగేంద్ర న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు  త్రిపుర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పవిత్రా కౌర్ వెల్లడించారు. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలకావడం కావడంతో మంత్రి ఖగేంద్ర కన్నుమూశారని సీపీఎం అధికార ప్రతినిధి గౌతం దాస్ వెల్లడించారు. కాగా, ఖగేంద్ర జమాటియా 1983లో సీపీఎంలో చేరారు. ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో క్రిష్ణాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఖగేంద్ర.. 1988 నుంచి ఆరుసార్లు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు. రెండు పర్యాయాలు త్రిపుర కేబినెట్‌లో మంత్రిగా సేవలందించారు. శనివారం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడుతున్న వేళ ఖగేంద్ర మరణం సీపీఎం శ్రేణుల్లో విషాదం నింపింది.

Related Posts