YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీకి తాకిన  ప్రత్యేక హోదా సెగ

Highlights

  • నిరసన చేపట్టిన ప్రత్యేక హోదా సాధన సమితి
  • కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరిక
ఢిల్లీకి తాకిన  ప్రత్యేక హోదా సెగ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఏపీ భవన్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి, నాన్ పొలిటికల్ జేఏసీలు ఆందోళన చేపట్టాయి. హోదాపై సరైన రీతిలో స్పందించకపోతే... కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామని ఈ సందర్భంగా నేతలు హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో అప్పుడే నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా సాధన కమిటీ ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను మొదలు పెట్టింది. విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించింది. ఈ క్రమంలో విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. 

Related Posts